భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులకు ఆదేశాలు
హైదరాబాద్, రాష్ట్రంలో కొనసాగుతున్న భారీ వర్షాల నేపధ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సీఎం ఈ ఉదయం ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.
ముఖ్యమంత్రి సూచనలు:
✅ వాగులు, వంకలు పొంగే ప్రమాదం ఉండడంతో లోతట్టు ప్రాంతాల కుటుంబాలను సహాయక శిబిరాలకు తరలించాలని కలెక్టర్లకు ఆదేశాలు.
✅ నీటి పారుదల శాఖ అధికారులు చెరువులు, రిజర్వాయర్ల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించి, నీటి విడుదలపై ముందుగానే సమాచారం ఇవ్వాలి.
✅ నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలు సిద్ధంగా ఉంచాలి.
✅ రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లోలెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై రాకపోకలు పూర్తిగా నిషేధించాలని పోలీసులు, రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి.
✅ పారిశుద్ధ్య శాఖలు చురుకుగా పనిచేస్తూ, వర్షపు నీరు నిల్వ ఉండి దోమలు, క్రిమికీటకాలు పెరగకుండా చూడాలి.
✅ వైద్య ఆరోగ్య శాఖ తగినంత మందులు సిద్ధం చేసి, అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి.
✅ ప్రాణనష్టం, ఆస్తి నష్టం, పశు నష్టం జరగకుండా రెవెన్యూ, విద్యుత్, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, వైద్య ఆరోగ్య, పురపాలక, పోలీసులు, అగ్నిమాపక శాఖ, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలి.
✅ హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే వినతులకు జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించాలి.
ముఖ్యమంత్రి అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించి, అవసరమైన చోట వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Post a Comment