చిల్లపల్లి గ్రామంలో చోరీ ఘటనపై ఎస్పీ పరిశీలన

 

చిల్లపల్లి గ్రామంలో చోరీ ఘటనపై ఎస్పీ పరిశీలన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని భరోసా

మెదక్ జిల్లా చల్లపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనపై జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు IPS ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి జరిగిన పరిణామాలపై సమాచారం సేకరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, చోరీ ఘటనను పోలీసులు అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారని తెలిపారు. కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని, నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఘటనపై ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించారు.

గ్రామాల్లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాల నియంత్రణకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.

పోలీసులు రాత్రి పహారా చర్యలను మరింత బలోపేతం చేస్తున్నారని, ప్రజల సహకారంతో నేరాలను అరికట్టగలమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ పరిశీలనలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Blogger ఆధారితం.