చెంచు గూడెంలో చిరుత దాడి – రహదారిపై చెంచుల నిరసన

చెంచు గూడెంలో చిరుత దాడి – రహదారిపై చెంచుల నిరసన


దోర్నాల, శ్రీశైలానికి 12 కి.మీ దూరంలోని చిన్నారుట్ల చెంచు గూడెంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన చిరుత దాడి కలకలం రేపింది. కుడుముల అంజయ్య–లింగేశ్వరి దంపతుల మూడేళ్ల కుమార్తె తల్లి పక్కన నిద్రిస్తున్న సమయంలో సమీప అటవీ నుంచి వచ్చిన చిరుతపులి చిన్నారిని ఈడ్చుకెళ్లింది. తండ్రి కేకలు వేయడంతో వెంబడించిన గ్రామస్థులు గ్రామ శివారులోనే చిరుత చిన్నారిని వదిలివెళ్లేలా చేశారు. ఈ దాడిలో గాయపడిన చిన్నారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సుమారు 70 ఏళ్లుగా చిన్నారుట్ల గూడెంలో నివసిస్తున్నప్పటికీ విద్యుత్ సౌకర్యం కల్పించలేదని ఐటీడీఏ అధికారులపై చెంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దోర్నాల–శ్రీశైలం రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సులు, వాహనాలను గంటపాటు నిలిపివేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న దోర్నాల అటవీ, పోలీసు శాఖాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చెంచులతో చర్చించగా ఆందోళనను విరమించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.