అర్బన్ పిహెచ్‌సీకి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్. జయలక్ష్మి

అర్బన్ పిహెచ్‌సీకి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్. జయలక్ష్మి


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DM&HO) డాక్టర్ ఎస్. జయలక్ష్మి రామవరంలోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (PHC)లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె నాన్-కమ్యూనికబుల్ డిసీజెస్ (NCDs) తో బాధపడుతున్న రోగులను కలుసుకుని, జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్లు, మరియు నియమిత వ్యాయామం వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు.

ఆమె గర్భిణీ స్త్రీలతో ప్రత్యేకంగా మాట్లాడి, సికిల్ సెల్ అనీమియా మరియు తలసేమియా వంటి రుగ్మతలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అన్ని గర్భిణీలు తప్పనిసరిగా HPLC పరీక్ష చేయించుకోవాలని వైద్య సిబ్బందికి సూచనలు జారీ చేశారు.

ఈ తనిఖీ సమయంలో డాక్టర్ రాము నాయక్ (మెడికల్ ఆఫీసర్), డాక్టర్ పుల్లా రెడ్డి (ప్రోగ్రామ్ ఆఫీసర్), ఎం.డి. ఫైజ్ మొహియుద్దీన్ (డిప్యూటీ డెమో), మరియు  శంకరమ్మ, స్పూర్తి పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.