సింగరేణి కార్మికులకు భారీ బోనస్! లాభాల్లో 34 శాతం పంపిణీ
సింగరేణి కార్మికులకు భారీ బోనస్! లాభాల్లో 34 శాతం పంపిణీ
హైదరాబాద్: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా ప్రభుత్వం భారీ బోనస్ను ప్రకటించింది. సింగరేణి కంపెనీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2,360 కోట్ల లాభాలు ఆర్జించిన నేపథ్యంలో, ఆ లాభాల్లో 34 శాతం మొత్తాన్ని కార్మికులకు బోనస్గా ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ ప్రకటనతో సింగరేణి ఉద్యోగుల ఆనందం వ్యక్తమవుతోంది. ఒకో రెగ్యులర్ కార్మికుడికి సుమారు రూ.1,95,610 బోనస్ లభించనుంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులను కూడా ప్రభుత్వం మరువలేదు. వారికి రూ.5,500 బోనస్ కేటాయించగా, మొత్తం కాంట్రాక్ట్ కార్మికులకు కలిపి రూ.819 కోట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఈ నిర్ణయంతో వేలాది సింగరేణి కార్మిక కుటుంబాలు పండగ వాతావరణంలో మునిగిపోయాయి. ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా కార్మికులకు బోనస్ ప్రకటించడం సింగరేణి కంపెనీ సంప్రదాయంగా మారింది. ఈసారి లాభాలు అధికంగా రావడంతో కార్మికులకు మరింత ఎక్కువ మొత్తంలో బోనస్ దక్కింది.
కార్మిక సంఘాలు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, బోనస్ పెంపు కార్మికుల కృషికి గుర్తింపు అని పేర్కొన్నాయి. మరోవైపు, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా గౌరవప్రదమైన బోనస్ కేటాయించడం సంతోషకరమని అభిప్రాయపడ్డాయి.
Post a Comment