40 వేలు లంచం డిమాండ్ – రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్‌పై ఏసీబీ కేసు

40 వేలు లంచం డిమాండ్ – రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్‌పై ఏసీబీ కేసు


వనపర్తి, సెప్టెంబర్ 18: తహసీల్దార్ కార్యాలయంలో  ఫిర్యాదుదారుని బంధువుల భూమికి సంబంధించిన పంచనామా నివేదికను తయారు చేసి, ఒ.ఆర్.సి (Occupancy Right Certificate) జారీ చేయించేందుకు అధికారిక సహాయం అందించే నెపంతో రూ.40,000 లంచం డిమాండ్ చేసిన ఇద్దరు రెవెన్యూ శాఖాధికారులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) కేసు నమోదు చేసింది.

వనపర్తి జిల్లా కొత్తకోట మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సి. వాసు, మండల సర్వేయర్ జి. నవీన్ రెడ్డి లు ఈ డిమాండ్ చేసినట్లు అనిశా అధికారులు తెలిపారు.

ప్రజలకు అనిశా విజ్ఞప్తి చేస్తూ – ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరిన పక్షంలో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయాలని కోరారు. అదనంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు అధికారిక వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు.

అలాగే, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగానే ఉంచబడతాయి అని అనిశా అధికారులు హామీ ఇచ్చారు.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.