లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దారు కార్యాలయంలో ముగ్గురు అధికారులు

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దారు కార్యాలయంలో ముగ్గురు అధికారులు


ఖమ్మం జిల్లా తల్లాడ మండల తహసీల్దారు కార్యాలయంలో లంచం ఘటన వెలుగుచూసింది. ఫిర్యాదుదారుడు కొనుగోలు చేసిన భూమిని ఆయన పేరుమీద రిజిస్టర్ చేసేందుకు, సంబంధిత ప్రక్రియను పూర్తిచేసేందుకు రూ.10,000/- లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

లంచం కేసులో చిక్కినవారు:

  • తహసీల్దారు వంకాయల సురేష్ కుమార్
  • రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాలోత్ భాస్కర్ రావు
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్

ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

అవినీతి నిరోధక శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ—
ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరిన సందర్భంలో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయాలని కోరింది. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా సమాచారం అందించవచ్చని తెలిపింది.

అంతేకాకుండా ఫిర్యాదుదారుల/బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని అనిశా స్పష్టం చేసింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.