వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 11: రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకూడదని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నగరంలోనూ, జిల్లాల్లోనూ వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సీఎం సూచనల వివరాలు:
- హైదరాబాద్ నగరంలో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకుంటూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.
- పురాతన ఇళ్లలో నివసిస్తున్న ప్రజలను ముందుగానే ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలి అని అధికారులను ఆదేశించారు.
- వాగులు, లోతట్టు కాజ్వేలు, కల్వర్టులపై నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి, ఎక్కడైనా ముంపు పరిస్థితులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
- చెరువులు, కుంటలకు గండి పడే ప్రమాదం ఉన్నందున నీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు.
🔹 వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రతి శాఖ సమన్వయంతో క్షేత్ర స్థాయిలో పనిచేయాలని, ప్రజల ప్రాణ రక్షణే ప్రథమ కర్తవ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హితవు పలికారు.

Post a Comment