భజన మందిర్ రోడ్డు రైల్వే ట్రాక్పై రైల్వే గేట్ ఏర్పాటు చేయాలి : మహబూబ్ జాని డిమాండ్
భజన మందిర్ రోడ్డులో రైల్వే గేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
ప్రతీ వారంలో రెండు నుంచి మూడు సార్లు నడిచే గూడ్స్ రైలు కారణంగా సన్యాసి బస్తీ, రామ టాకీస్ ఏరియా, బర్లిపిట్ బస్తీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిల్లలు, గర్భిణీ మహిళలు, వృద్ధులు అనారోగ్య పరిస్థితుల్లో అంబులెన్స్ కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఆసుపత్రికి వెళ్లడానికి అంబులెన్స్ 3 కిలోమీటర్ల చుట్టుపక్కల మార్గం తిరిగి వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. అంతేకాదు శ్మశానవాటికకు శవాన్ని తీసుకువెళ్లడానికైనా, బజారుకు సరుకుల కోసం వెళ్ళడానికైనా ప్రజలు దూరం తిరగాల్సి వస్తోందని ఆయన వివరించారు.
రైల్వే గేట్ ఏర్పాటు చేస్తే రామ టాకీస్ ఏరియా, ప్రభుత్వ ఆసుపత్రి, ఓల్డ్ డిపోతో పాటు ఖమ్మం వెళ్లే వారికి కూడా సౌకర్యం కలుగుతుందని మహబూబ్ జాని తెలిపారు. ప్రస్తుతం పట్టణంలో మహాత్మా గాంధీ రోడ్డే ప్రధాన మార్గంగా ఉండటంతో ట్రాఫిక్ భారమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గేటు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్, రైల్వే అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలు పడుతున్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని తక్షణమే రైల్వే గేట్ ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Post a Comment