శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు జాగ్రత్త సూచన జారీ
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరిధిలో ఎగువ ప్రాంతాల నుండి వరద నీరు భారీగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అధికారులు తెలిపారు, ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రాజెక్టు స్పిల్వే గేట్లు ఎత్తి గోదావరి నదిలోకి వరద నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
దీనితో గోదావరి నదిలో నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగనుంది.
అందువల్ల ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లో —
- చేపలు పట్టేవారు,
- పశువుల కాపర్లు,
- గొర్ల కాపరులు,
- రైతులు,
- మరియు సామాన్య ప్రజలు —
జాగ్రత్తగా వ్యవహరించాలని, గోదావరి నదిలో దిగడం లేదా దాటే ప్రయత్నాలు చేయవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.
జీవన భద్రత దృష్ట్యా, నది తీర ప్రాంతాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రదేశాలకు వెళ్లి ఉండాలని సూచించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అధికారులు

Post a Comment