తెలంగాణ లోకల్ బాడీ ఎన్నికలు నిలిపివేత.. ప్రభుత్వానికి హైకోర్టు షాక్
హైదరాబాద్, అక్టోబర్ 9: తెలంగాణలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఎన్నికల నోటిఫికేషన్పై స్టే ఆదేశాలు జారీ చేసింది. దీంతో లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది.
🔹 హైకోర్టు ఆదేశాల వివరాలు
🔹 ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు
విచారణ సందర్భంగా రాష్ట్ర అటార్నీ జనరల్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ —
“బీసీ జనాభా 57.6 శాతం ఉందని సర్వేలో తేలింది. బీసీల సంఖ్యపై ఎలాంటి అభ్యంతరం లేనప్పుడు పిటిషనర్లకు రిపోర్ట్ అవసరమేంటి? ఈ బిల్లుపై ఒక్క పార్టీ కూడా అభ్యంతరం తెలపలేదు.గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే అది చట్టంగా పరిగణించాలి. తమిళనాడు కేసులో సుప్రీంకోర్టు కూడా ఇదే తీర్పు ఇచ్చింది.”
అలాగే ఆయన “స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోలేవు. విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు వేరు – రాజకీయ రిజర్వేషన్లు వేరు. ఇందిరా సహాని కేసు విద్య, ఉద్యోగాలకే సంబంధించినది. మేం రాజకీయ రిజర్వేషన్లకోసం జీవో తీసుకొచ్చాం” అని వాదించారు.
🔹 నేపథ్యం
బీసీ రిజర్వేషన్ల శాతం పెంపుపై పిటిషన్లు హైకోర్టులో విచారణలో ఉండగా, ప్రభుత్వం జీవో నంబర్ 9 ఆధారంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే దీనిపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనితో హైకోర్టు ప్రభుత్వ చర్యపై స్టే విధిస్తూ ఎన్నికలను నిలిపివేసింది.

Post a Comment