మహిళ మృతికి కారణమైన కారు డ్రైవర్కు జైలు శిక్ష
కొత్తగూడెం: మహిళ మృతికి కారణమైన కారు డ్రైవర్కు కోర్టు జైలు శిక్ష విధించింది. కొత్తగూడెం మొదటి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కే. సాయి శ్రీ మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించారు.
ఈ ప్రమాదంలో నాచబోయిన లలిత తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. అదే కారు ప్రమాదానికి ముందు సుమారు 100 గజాల దూరంలో మాచినపేటకు చెందిన లాకావత్ సాయికుమార్, బోడా అశోక్ కుమార్ ప్రయాణిస్తున్న మోటార్ సైకిల్ (AP 24 AL 1262)ను ఢీకొనడంతో వారు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
ఫిర్యాదు మేరకు అప్పటి హెడ్ కానిస్టేబుల్ కే. రామదాస్ కేసు నమోదు చేశారు. అనంతరం సబ్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాస్ దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. కోర్టు మొత్తం 14 మంది సాక్షులను విచారించింది.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బి. విశ్వశాంతి వాదించారు. కోర్టు నోడల్ అధికారి ఎస్సై డి. రాఘవయ్య, కోర్టు పీసీ ఉపేందర్ రావు సహకరించారు.

Post a Comment