సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.1.50 లక్షల ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత

సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.1.50 లక్షల ఎల్టీసీ మంజూరు పత్రం అందజేత


రామాంతాపూర్, మే 24: రామాంతాపూర్ పరిధిలోని వెంకట సాయి నగర్ కాలనీకి చెందిన రామసాని భవాని అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.1,50,000 ఆర్థిక సహాయం మంజూరైంది. ఈ సందర్భంగా ఎల్టీసీ మంజూరు పత్రాన్ని కాలనీ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి, గౌరవ సభ్యులు మరియు వారి టీమ్ సభ్యులు కలిసి బాధితురాలికి అందజేశారు.

ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి సహకారంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం ఎల్ఓసీ (LOC) పొందడంతో పాటు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం మంజూరైనట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బాధితురాలికి నిమ్స్ ఆసుపత్రిలో ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గౌరవ సభ్యులు రమేష్ గౌడ్, రవికుమార్, సంజీవ, ఐలేష్ యాదవ్, రమేష్ యాదవ్, శంకర్, రమేష్ శెట్టి, గోపాల్, సర్వ సత్తయ్య యాదవ్ పాల్గొన్నారు. అలాగే టీమ్ సభ్యులు ఆర్. గోవింద్, జి. అశోక్, సి హెచ్ శ్రీనివాస్ గౌడ్, కొల్ల నవీన్ కుమార్, భూపతి నరసింహ, విద్యాసాగర్, రామకృష్ణ, శివ, బాల కొమురయ్య, నరేష్, జగన్, స్వామి, భూపతి రాము గౌడ్, శ్రీధర్ గౌడ్, చంద్రం చారి, గణేష్, హుసేన్, సిరినగుల పరశురామ్, కృష్ణ, సునీల్, మొగులయ్య, సమ్మన్న తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.