కొత్తగూడెం బక్రీద్ నమాజ్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ వక్ఫ్ బోర్డు నియామకం

కొత్తగూడెం బక్రీద్ నమాజ్ నిర్వహణకు తాత్కాలిక కమిటీ వక్ఫ్ బోర్డు నియామకం

హైదరాబాద్, మే 25: Telangana Waqf Board భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బక్రీద్ నమాజ్-2026 నిర్వహణ కోసం ఈద్గాహ్ మరియు ఖబర్‌స్తాన్ (ముస్లిం సమాధి స్థలం) నిర్వహణకు తాత్కాలిక (అధోక్) కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వక్ఫ్ బోర్డు జోన్-3 కార్యాలయం సోమవారం మెమో విడుదల చేసింది.

ఈ నిర్ణయం కోసం MLA Kunamneni Sambasiva Rao మే 22న వక్ఫ్ బోర్డుకు లేఖ రాయగా, అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ నివేదికను సమర్పించారు. ఈ నివేదికలను పరిశీలించిన అనంతరం బక్రీద్ నమాజ్ నిర్వహణకు అనుమతి మంజూరు చేశారు.

వక్ఫ్ బోర్డు ఆదేశాల మేరకు ఈ అధోక్ కమిటీ వక్ఫ్ ఇన్‌స్పెక్టర్ ఆడిటర్ పర్యవేక్షణలో పనిచేయనుంది. కమిటీలో ఉమర్ ఫరూక్ యజ్దానీ అధ్యక్షుడిగా, గౌస్ మొహియుద్దీన్ మరియు మహ్మద్ అమీర్ ఉపాధ్యక్షులుగా, సయ్యద్ అన్వర్ అలీ ప్రధాన కార్యదర్శిగా, జాయింట్ కార్యదర్శి సయ్యద్ సాధిఖుల్లా హుస్సేన్, కొశాధికారిగా మొహ్మద్ యూసుఫ్ నియమితులయ్యారు. తొమ్మిది మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

బక్రీద్ ప్రార్థనలకు హాజరయ్యే ముసల్లీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని కమిటీకి వక్ఫ్ బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Blogger ఆధారితం.