నిషేదిత మావోయిస్టు పార్టీకి చెందిన (08) మంది దళ సభ్యులు జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు

నిషేదిత మావోయిస్టు పార్టీకి చెందిన (08) మంది దళ సభ్యులు  జిల్లా ఎస్పీ ఎదుట లొంగుబాటు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు మరియు 81 & 141 CRPF బెటాలియన్ అధికారులు ఆదివాసీ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కొరకు నిర్వహిస్తున్న "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం ద్వారా లొంగిపోయిన సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసు శాఖ కల్పిస్తున్న సదుపాయల గురించి తెలుసుకుని, నక్సలిజాన్ని విడనాడి ఇకపై తాము కూడా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని నిర్ణయించుకొని వివిధ స్థాయిలలో పనిచేస్తున్న (08) మంది నిషేదిత , ໖໖) PPCM/ACMs-01, Party Members-01, Militia Members-06, ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ గారి ముందుకు వచ్చి జనజీవన స్రవంతిలో కలవడం జరిగింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న "ఆపరేషన్ చేయూత" కార్యక్రమం ద్వారా ఈ సంవత్సరం జనవరి 2025 నుండి ఇప్పటివరకు వీరితో కలిపి 314 మంది మావోయిస్టు దళసభ్యులు 22 ລ້ ລ້ DVCMs-04, ACMs-21, PMs-40, Militia Members-116, RPC Members-35, DAKMS/KAMSs-47, CNM Members-30, GRD Members-21 ລ້ ລ້ລ້ 5 పునరావాస సౌకర్యాలను పొందడం జరిగినది.

తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసు శాఖ ఆదివాసీల అభివృద్ధి మరియు సంక్షేమం కొరకు కృషిచేస్తున్నారు. ఆధివాసి ప్రాంతాలలో రోడ్లు, పాఠశాలలు, వైద్యశాలలు, త్రాగునీరు మరియు విద్యుత్తు సౌకర్యాలు లాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగినది. ప్రతి మారుమూల గిరిజన ప్రాంతానికి నాణ్యమైన విద్య మరియు వైద్య సౌకర్యాలు కల్పించడానికి పోలీసు శాఖ కృషి చేస్తున్నది.

ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి (05) మంది సభ్యులు మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారు మరియు తెలంగాణ రాష్ట్రం నుండి (81) మంది మావోయిస్ట్ పార్టీ లో వివిద రాష్ట్రాలలో సభ్యులుగా ఉన్నారు. తెలగాణ పోలీసు శాఖ మరియు భద్రాద్రి కొత్తగూడెం పోలీసు తరుపున మావోయిస్ట్ పార్టీలో సభ్యులుగా పనిచేస్తున్న వారు మావోయిస్ట్ పార్టీని విడనాడి ఇకపై వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ఆదివాసీ ప్రజలకు విజ్ఞప్తి... మీరు నమ్మకంతోనో లేదా భయంతోనో మావోయిస్టు పార్టీకి ఎంత సహకరించినా మీ ఆదివాసీ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవు. కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాల ద్వారా మాత్రమే అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధితో కూడిన ప్రజల శాంతియుత జీవనం మా పోలీసుల నినాదం.

ఈ రోజు లొంగిపోయిన (08) మంది మావోయిస్టు దళ సభ్యులకు తక్షణ సహాయంగా ప్రతి ఒక్కరికి 25 వేల రూపాయల చొప్పున మొత్తం నగదు రూ.2,00,000/- ఇవ్వడం జరుగుతుంది. తదుపరి వారి ర్యాంకుల వారిగా మిగతా నగదును, ఆధార్ కార్డులు మరియు బ్యాంక్ అకౌంట్స్ వచ్చిన తర్వాత వారి బ్యాంకు ఖాతాలలో మిగతా మొత్తం ను చెక్కుల రూపంలో జమ చేయబడును.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.