చెకప్ కోసం తీసుకెళితే తప్పించుకున్న ఖైదీ.. గాంధీ ఆసుపత్రిలో కలకలం!
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సినిమా సన్నివేశాన్ని తలపించే ఘటన చోటుచేసుకుంది. దోపిడీ కేసులో అరెస్టైన ఖైదీ పోలీసులను మోసగించి పరారయ్యాడు.
👉 పోలీసుల వివరాల ప్రకారం, రెండు రోజుల క్రితం సోహైల్ అనే నిందితుడిని దోపిడీ కేసులో అదుపులోకి తీసుకున్నారు. చర్లపల్లి జైలుకు తరలించే ముందు, నిబంధనల ప్రకారం వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి పోలీసులు తీసుకెళ్లారు.
👉 అయితే, చెకప్ జరుగుతున్న సమయంలో టాయిలెట్కి వెళ్తానని చెప్పిన సోహైల్ అక్కడి నుంచి బయటకు వెళ్లి, వెంటిలేటర్ ద్వారా కిందికి దూకి తప్పించుకున్నాడు.
👉 ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా, పోలీసులు వెంటనే మరో కేసు నమోదు చేసి, సోహైల్ కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
👉 అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, సోహైల్పై దోపిడీతో పాటు పలు కేసులు నమోదై ఉన్నాయని తెలిసింది.
🚨 ఆసుపత్రి ప్రాంగణంలోనే ఈ తప్పించుకోవడం, భద్రతా లోపాలపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది.
Post a Comment