హైదరాబాద్‌కు గోదావరి నీరు.. రూ.2,085 కోట్ల కాంట్రాక్టు రాంకీకి..!

 హైదరాబాద్‌కు గోదావరి నీరు.. రూ.2,085 కోట్ల కాంట్రాక్టు రాంకీకి..!

హైదరాబాద్‌కు గోదావరి నీరు.. రూ.2,085 కోట్ల కాంట్రాక్టు రాంకీకి..!


హైదరాబాద్‌: దేశంలోని ప్రముఖ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థలలో ఒకటైన రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భారీ కాంట్రాక్టును దక్కించుకుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీ) నుండి రూ.2,085 కోట్ల విలువైన గోదావరి తాగునీటి సరఫరా పథకం – ఫేజ్ II & ఫేజ్ III పనులు రాంకీకి కట్టబెట్టబడ్డాయి.

గోదావరి నీటితో ఉస్మాన్సాగర్, హిమాయత్‌సాగర్ నింపడం

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మూసీ నది పునరుజ్జీవనానికి సహాయపడే విధంగా ఉస్మాన్సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లను గోదావరి నీటితో నింపనున్నారు. దీంతో నగరానికి తాగునీటి భద్రత మరింతగా లభించనుంది.

హైబ్రిడ్ యాన్యుటీ మోడల్‌లో ప్రాజెక్ట్

రాంకీ అనుబంధ సంస్థ మల్లన్నసాగర్ వాటర్ సప్లై లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్‌ను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) కింద అమలు చేస్తుంది.

  • నిర్మాణ పనులు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • ప్రాజెక్ట్ పూర్తయ్యాక 10 సంవత్సరాల పాటు రాంకీ నిర్వహణ బాధ్యతలు వహించనుంది.

రాంకీ ఎంఢీ వ్యాఖ్యలు

“హైదరాబాద్‌లో పెరుగుతున్న తాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా, స్థిరమైన నీటి మౌలిక సదుపాయాలను నిర్మించాలనే మా నిబద్ధతను ఈ ప్రాజెక్ట్ బలోపేతం చేస్తుంది. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్‌బీతో భాగస్వామ్యం కావడం మాకు గర్వంగా ఉంది” అని రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ యంచర్ల రత్నాకర నాగరాజా పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.