సిగ్నల్ వద్ద భర్త పండ్లు కొనుక్కొని వచ్చేలోపే భార్య అదృశ్యం
హైదరాబాద్: ఆశ్చర్యకర సంఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. భర్త కళ్ల ముందే భార్య మాయమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం— కర్ణాటకలోని కాలకుండ గ్రామానికి చెందిన అండగ్ల శ్రీనివాస్, సువర్ణ (20) దంపతులు ఈ నెల 14న కూకట్పల్లిలోని మేనమామ ఇంటికి రావడానికి బయలుదేరారు. కూకట్పల్లి బస్టాప్లో దిగిన తరువాత, శ్రీనివాస్ తన భార్యను సిగ్నల్ వద్ద నిలబడమని చెప్పి, పండ్లు కొనటానికి రోడ్డు దాటాడు.
ఐదు నిమిషాల వ్యవధిలోనే పండ్లు కొనుక్కని తిరిగి వచ్చేసరికి భార్య సువర్ణ కనిపించలేదు. చుట్టుపక్కల వెతికినా, బంధువుల ఇళ్లలో ఆరా తీశినా ఎటువంటి సమాచారం లభించలేదు.
దీంతో శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment