🌧️ నాలుగు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక 🌧️
హైదరాబాద్: ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఈనెల 26న అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు చేరుతుందని, 27వ తేదీ నాటికి భూభాగాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో తెలంగాణలో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
📍 గురువారం (25వ తేదీ)
- ఆదిలాబాద్
- కొమురంభీం ఆసిఫాబాద్
- మంచిర్యాల
- నిర్మల్
- నిజామాబాద్
- పెద్దపల్లి
- జయశంకర్ భూపాలపల్లి
- ములుగు
- భద్రాద్రి కొత్తగూడెం
- మహబూబాబాద్
- వరంగల్
- హనుమకొండ
➡️ ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
📍 శుక్రవారం (26వ తేదీ)
- నిర్మల్
- నిజామాబాద్
- వికారాబాద్
- సంగారెడ్డి
- మెదక్
- కామారెడ్డి
- మహబూబ్నగర్
➡️ ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
👉 రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Post a Comment