కూలీపై మట్టిపోసిన జేసీబీ డ్రైవర్.. గంటకు పైగా నరకయాతన (వీడియో)
కొత్తగూడెంలో షాకింగ్ ఘటన – కూలీపై మట్టి పోసిన జేసీబీ డ్రైవర్, గంటకు పైగా నరకయాతన
కొత్తగూడెం పట్టణంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పైప్లైన్ పనుల సమయంలో జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి పని చేస్తున్న కూలీపై మట్టి పోశాడు. ఈ ఘటన శనివారం ఓ స్కూల్ ఎదురుగా చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే – స్థానికంగా పైప్ లైన్ పనులు జరుగుతుండగా, జేసీబీతో కాలువ తవ్వకాలు కొనసాగించేవాడు. ఆ సమయంలో కాలువలో పని చేస్తున్న వలస కూలీ సంతోష్పై డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించకపోవడంతో మట్టి పోసాడు. ఒక్కసారిగా మట్టిలో కూరుకుపోయిన సంతోష్ గట్టిగా కేకలు వేసినా వినిపించుకోలేదు. ఫలితంగా దాదాపు గంటకు పైగా అతడు మట్టిలోనే నరకయాతన అనుభవించాల్సి వచ్చింది.
సంఘటన చూసిన తోటి కూలీలు, స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సంతోష్ను బయటకు తీశారు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు జేసీబీ డ్రైవర్పై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు జేసీబీ డ్రైవర్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు.
Post a Comment