సీపీఎం సీనియర్ నేత దారుణ హత్యపై ఆగ్రహం — స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సీపీఎం సీనియర్ నేత దారుణ హత్యపై ఆగ్రహం — స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దోషులను వెంటాడి శిక్షిస్తామని హెచ్చరిక


ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ — “హింసాత్మక రాజకీయాలకు చోటు లేదు. దోషులను వెంటాడి, వేటాడి చట్టపరంగా శిక్షిస్తాం” అని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఖమ్మం పోలీసు అధికారులను ఆయన అప్రమత్తం చేశారు.

డిప్యూటీ సీఎం భట్టి క్లూస్ టీం, స్నిఫర్ డాగ్స్, సైబర్ టీం సహాయంతో ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి నిందితులను త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. సామినేని రామారావు కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. “వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటా, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుంది” అని భరోసా ఇచ్చారు.

ఈ ఘటనలో, తెల్లవారుజామున వాకింగ్‌కి వెళ్లిన రామారావును గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంకొన్ని రోజుల్లో ఆయన మనవరాలి వివాహం ఖమ్మంలో జరగనుండగా ఈ దారుణం చోటుచేసుకుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన సామినేని రామారావు పార్టీకి అత్యంత కీలక నేతగా గుర్తింపు పొందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.