బ్రాహ్మణపల్లిలోని మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు చేయాలంటూ వినతిపత్రం

బ్రాహ్మణపల్లిలోని మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతు చేయాలంటూ వినతిపత్రం


శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కి విజ్ఞప్తి

మెదక్, అక్టోబర్ 10: తూప్రాన్ మున్సిపాలిటీ పదో వార్డు, వెంకటాపూర్ గ్రామ పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజలు శుభ్రమైన తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఒక ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామంలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ యంత్రాంగం దెబ్బతినడంతో అది చాలా కాలంగా నిలిచిపోయింది.

దీని కారణంగా గ్రామ ప్రజలు బోర్లు, చెరువుల నీటిని వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడగా, ఫలితంగా విషజ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజల తరఫున శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం అందజేశారు. ప్లాంట్ యంత్రాల మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేసి, వాటర్ ప్లాంట్‌ను తిరిగి ప్రారంభించాలనే విజ్ఞప్తి ఆయన చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, రాజిరెడ్డి, బాబు, ఎల్లారెడ్డి, సిద్ధగౌడ్, సత్యనారాయణ, నాగేందర్ రెడ్డి, బాబుగౌడ్, ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.