మలయాళ హీరోల ఇళ్లలో ఈడీ సోదాలు!

మలయాళ హీరోల ఇళ్లలో ఈడీ సోదాలు!


హైదరాబాద్, అక్టోబర్ 08: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున దాడులు చేపట్టారు. మొత్తం 17 ప్రాంతాల్లో ఒకేసారి జరుగుతున్న ఈ సోదాల్లో మలయాళ స్టార్‌ హీరోలు పృథ్వీరాజ్‌ సుకుమారన్, దుల్కర్‌ సల్మాన్‌ నివాసాలు కూడా ఉన్నాయి.

విదేశీ డబ్బు లావాదేవీలు, అలాగే భూటాన్‌ నుంచి లగ్జరీ కార్ల అక్రమ దిగుమతి కేసులపై దర్యాప్తులో భాగంగా ఈడీ ఈ చర్యలు చేపట్టింది. భూటాన్‌ ద్వారా అధిక విలువ కలిగిన వాహనాలు చట్టవిరుద్ధంగా తెచ్చారని ఆరోపణలున్నాయి.

సెప్టెంబర్‌లో ఇదే కేసులో సోదాలు చేసిన ఈడీ — ఇప్పుడు మరోసారి దాడులు నిర్వహిస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌ నివాసంలో, అలాగే పృథ్వీరాజ్‌ ఇంటిలో ఈడీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు.

గతంలో కస్టమ్స్‌ విభాగం కూడా ఇదే అంశంపై చర్యలు తీసుకున్నది. తాజా సోదాలతో దర్యాప్తు మరింత వేగం పందుకుంది. మలయాళ సినీ వర్గాల్లో ఈ ఘటన పెద్ద చర్చనీయాంశంగా మారింది.

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.