గెట్ టు గెదర్ పార్టీలో విషాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
గెట్ టు గెదర్ పార్టీలో విషాదం.. సాఫ్ట్వేర్ ఉద్యోగి అనుమానాస్పద మృతి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం గ్రామ శివారులో ఉన్న ఓ ఫామ్హౌస్లో గెట్ టు గెదర్ పార్టీ విషాదంగా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగి గుండ్ల మధు (27) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మంచిర్యాల జిల్లాకు చెందిన మధు హైదరాబాద్లోని రామంతాపూర్ ప్రాంతంలో ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. వీకెండ్ సందర్భంగా అదే కంపెనీకి చెందిన సుమారు 15 మంది ఉద్యోగులు శనివారం సాయంత్రం కొయ్యలగూడెం సమీపంలోని ఫామ్హౌస్లో గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.
అయితే పార్టీ జరుగుతున్న సమయంలో మధు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మధు మృతికి గల కారణాలపై వివిధ కోణాల్లో విచారణ చేపట్టిన అధికారులు, పార్టీలో పాల్గొన్న సహోద్యోగులను ప్రశ్నిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment