గ్రూప్ పరీక్షల్లో గ్రూప్-1, 2, 3, 4 ఫలితాల్లో మెరిసిన బింగి కీర్తన
కరీంనగర్ జిల్లా కొండాపూర్కు చెందిన బింగి కీర్తన తన ప్రతిభను గ్రూప్-1, 2, 3, 4 ఫలితాల్లో చాటారు. చిన్ననాటి నుండి వైద్యురాలిగా మారి పేదలకు సేవ చేయాలనే కల కలిగినా, ఆ అవకాశాన్ని స్వల్ప తేడాతో కోల్పోయారు. అయితే ప్రజాసేవకై మరో మార్గాన్ని ఎంచుకుని, ప్రభుత్వాధికారిణి కావాలనే సంకల్పంతో గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యారు.
ఆ క్రమంలో గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్గా, గ్రూప్-1లో ఎంపీడీవోగా, గ్రూప్-2లో ఎక్సైజ్ ఎస్సైగా, గ్రూప్-3లోనూ విజయాన్ని సాధించారు. అధికారిణిగా ప్రజల సమస్యలను పరిష్కరించి సేవ చేయడం తన ప్రధాన లక్ష్యమని కీర్తన స్పష్టం చేశారు.
కుటుంబ సభ్యుల ప్రోత్సాహమే ఈ విజయానికి మూలమని పేర్కొన్న ఆమె, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో సేవలందించాలనేది తన ఆశయమని తెలిపారు.
👉 కీర్తన సాధన కరీంనగర్ యువతకు స్ఫూర్తిదాయకం అవుతోంది.
Post a Comment