దీపావళి సందర్భంగా రైల్వే శాఖ కఠిన హెచ్చరిక రైల్లో బాణసంచా తీసుకెళ్తే జైలుకే!
హైదరాబాద్, అక్టోబర్ 12: దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో రైల్వే అధికారులు ప్రయాణికులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. రైళ్లలో బాణాసంచా, పేలుడు పదార్థాలు, లేదా సులభంగా మండే వస్తువులు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు.
రైల్లో చిన్న నిప్పురవ్వ పడినా రైలు మొత్తం మంటలు అంటుకునే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు భారీ ఆస్తి నష్టం మాత్రమే కాకుండా వందలాది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించే అవకాశం ఉందని తెలిపారు.
రైల్వే భద్రతా విభాగం (RPF) ఈ పండుగ సీజన్లో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. రైల్వే స్టేషన్లలో, ప్లాట్ఫారమ్లలో మరియు రైళ్లలో ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేయడం జరుగుతుంది.
“దీపావళి ఆనందాన్ని సురక్షితంగా జరుపుకోండి. కానీ రైల్వేలో బాణాసంచా తీసుకెళ్లి మీ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దు,” అని రైల్వే అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Post a Comment